నాలుగు రోజులుగా చెన్నై లో ఎక్క‌డ చూసినా కూడా ఇదే దుస్థితి. చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో గజగజా వణుకుతూ ఉండ‌డంతో ఎక్క‌డ చూసినా కూడా తాగ‌డానికి మంచి నీళ్లు కూడా దొర‌క‌డం లేదు.  మ‌రో వైపు తిన‌డానికి తిండి లేక ల‌క్ష‌లాది మంది ఎదురు చూస్తున్నారు. మ‌హా న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా ప్ర‌ధాన రోడ్లు అన్ని కూడా న‌దుల‌ను త‌ల‌పించే స్తున్నాయి. అస‌లు రాత్రి వేళ క‌రెంటు లేక పోవ‌డంతో చెన్నై మ‌హా న‌గ‌రం అంధకారంలో ఉంది. రోడ్ల మీద ఎక్క‌డ చూసినా చిమ్మ చీక‌ట్లే క‌నిపిస్తున్నాయి.

ప‌రిస్థితి తీవ్రంగా ఉండ‌డంతో ముఖ్య‌మంత్రి స్టాలిన్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూనే ఉన్నారు. ఆయ‌న స్వ‌యంగా స‌హాయ‌క  చ‌ర్య‌ల ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక గురువారం ఉద‌యం కూడా న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ప‌లు ప్రాంతా ల్లో ఎడ తెరిపి లేకుండా భారీ వ‌ర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే .. మ‌రి కొన్ని చోట్ల 40 నుంచి 30 మిల్లీ మీట‌ర్ల మేర వ‌ర్షాలు కురివాయి.

ఇక సాయంత్రం 6 గంట‌ల‌కు అయితే అన్ని ప్ర‌ధాన ర‌హ‌దారులు న‌దులు, చెరువుల‌ను త‌ల‌పించేశాయి. న‌గ‌రం మొత్తం మీద 500 కు పైగా కాల‌నీలు నీట  మునిగి పోయాయి. ఇక న‌గ‌రం లో ఎక్క‌డి క‌క్క‌డ భారీ ఎత్తున చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల లోత‌ట్టు ప్రాంతాలు మునిగి పోయి ప్ర‌జ‌లు ఇళ్ల ల్లో నుంచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. 

ఇక గ‌త రాత్రి చాలా కాల‌నీల్లో క‌రెంటు కూడా లేక‌పోవ‌డంతో న‌గ‌రం అంతా చీక‌ట్లో ఉండి పోయింది. అస‌లు న‌గ‌రం లో ఏం జ‌రుగుతుందో ?  కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఈ ప‌రిస్థితి చూస్తే  చెన్నై న‌గ‌రంలో సాధార‌ణ ప‌రిస్థితి రావ‌డానికి ఎంత లేద‌న్నా మ‌రో వారం రోజులు టైం ప‌ట్టేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: