మే 13 నుంచి జూన్ 2వ తేదీ వరకు 27 దేశాల్లో 780 మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు మాత్రమే నిర్దారణ కాగా ఆ తరవాత కేవలం కొద్దీ రోజుల్లోనే ఆ నంబర్ మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మే 3 తరవాత నుండి ఈ నెల 2 వరకు 780 కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ. ఈ మధ్య కాలంలోనే ఈ వైరస్ వేగం బాగా పెరిగిందని. ప్రపంచ దేశాలు అలెర్ట్ గా ఉండవలసిన అవసరం ఉందని తెలియచేసింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి కి సంబందించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మంకీపాక్స్ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు సంభవించడం దుదృష్టకరం. కాగా దేశంలో మంకీపాక్స్ గతంలో వైరస్ ప్రభంజనం సృష్టించిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ మంకీపాక్స్ వైరస్ లక్షణాలు పలువురిలో కనపడుతున్నాయి అని సమాచారం.
యూపీలోని ఘజియాబాద్లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం గమనార్హం. ఆ చిన్నారి శరీరంపై పెద్ద పెద్ద దద్దర్లు వచ్చి దురద ఉన్నట్టు తెలుపగా పరీక్షించిన వైద్యులు అవి మంకీ పాక్స్ లక్షణాలు అని గుర్తించారు. దీంతో, శాంపిల్స్ సేకరించి పూణేలోని ల్యాబ్కు టెస్ట్ కోసం పంపినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. అలాగే ఆ చిన్నారికి వైరస్ ఎలా సోకి ఉండొచ్చు అనే ప్రాథమిక దర్యాప్తు జరిగుతున్నట్లు తెలిపారు.
అయితే బాధితురాలి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వైద్యులు క్లారిటీ ఇవ్వడం తో అసలు ఆ చిన్నారికి వైరస్ ఎలా సోకి ఉంటుంది అన్న దాని పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యి దేశం లో మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ప్రజలు అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. రోజురోజుకీ ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం తో ఆందోళన కూడా పెరుగుతోంది.