
కేసీఆర్ ఆపరేషన్ కగార్ అంశాన్ని లేవనెత్తగానే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారని, ఇది కేసీఆర్ ప్రభావాన్ని తెలియజేస్తుందని వివేకానంద గౌడ్ అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బులతో రాజకీయం చేస్తూ అతిగా మాట్లాడుతున్నారని, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన మంత్రి సీతక్క కేసీఆర్ను విమర్శించడం సరికాదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా అందాల పోటీలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీలపై దృష్టి పెట్టడం కంటే ప్రజల సమస్యలపై సమీక్షలు చేయాలని వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్న వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించే ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఈ ఇళ్లలో నివసిస్తున్న వారికి తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేకపోతే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
94905 20108.. ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు