ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఎక్కువగా AI ను చాలామంది  రక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏఐ తో మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పలు టెక్ సంస్థలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ నియమాకాల ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి నేరుగా ఇంటర్వ్యూ కాకుండా వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ప్రక్రియ చాలా సులభవంతమైనదంటూ పలు టెక్ సంస్థలు తెలియజేశారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.


గూగుల్ ఇంటర్వ్యూలను ఆన్లైన్లో నిర్వహిస్తూ ఉంటే AI ని ఉపయోగించేసి ఇంటర్వ్యూ సక్సెస్ అవుతున్నవారు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అసలు విషయాలు బయటపడుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలియజేశారు.. అందుకే ఈ విషయంలో తాము యూ టర్న్ తీసుకుంటున్నామని.. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలను మాత్రమే ఇకమీదట నిర్వహిస్తామంటూ తెలియజేశారు. అందుకు సంబంధించి ప్రణాళికలను కూడా ప్రస్తుతం సిద్ధం చేస్తున్నామంటూ తెలియజేశారు గూగుల్ సీఈవో.


మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు నిర్ధారించేందుకే కనీసం ఏదైనా ఒక్క ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందట. AI ని ఉపయోగించుకొని చాలామంది అనర్హులు ఉద్యోగాలలో చేరుతున్నారని.. దీంతో గూగుల్ కంపెనీ యాజమాన్యానికి కూడా చాలా మంది వినతులు పంపించారట. ఇంటర్వ్యూలలో హాజరవుతున్న వారిలో 50 శాతం కంటే ఎక్కువమంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ ని ఉపయోగించి మోసం చేస్తున్నారని టెక్ నిపుణులకు ఒక నివేదిక చేరిందని తెలుస్తోంది. సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. హైబ్రిడ్ విధానంలో పని చేస్తున్నటువంటి సమయాలలో ఇలాంటి ఇంటర్వ్యూలలో కొంత భాగం వ్యక్తిగతంగా నిర్వహించాలనే ఆలోచన చాలా మంచిదిగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే గూగుల్ సంస్కృతిని కూడా అభ్యర్థులు అర్థం చేసుకునేందుకు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు..ఈ సమస్య అంతా కూడా గూగుల్ ఒక్క సంస్థకే కాదని ఐటీ ,టెక్ పరిశ్రమ మొత్తానికి ఉండవచ్చు అంటు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: