ఓవైపు కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది. గత ఏడాదిలాగే ఆలస్యం కాకుండా అనుకున్న సమయానికి ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక అన్ని జట్లు ఆటగాళ్లను బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంచి ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించింది బీసీసీఐ .  ఇక కొన్నాళ్లపాటు బిసిసిఐ ప్లాన్ సజావుగానే సాగింది. కానీ ఎక్కడో తేడా కొట్టేసింది. చివరికి బయో బబుల్ లోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది.  ఇక వరుసగా పలు జట్ల ఆటగాళ్ళు కరోనా వైరస్ బారిన పడ్డారు.



 చివరికి చేసేదేమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేసింది బిసిసీఐ. ఇక ఆ తర్వాత బీసీసీఐ మిగిలి ఉన్న మ్యాచ్ లు నిర్వహించడానికి ప్లాన్ చేసింది. అయితే ఈసారి ఇండియాలో కాకుండా యూఏఈ వేదికగా బిసిసిఐ మిగతా మ్యాచ్లు నిర్వహించాలని సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించిన షెడ్యూలు కూడా ప్రకటించింది.  చివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ అటు కొన్ని జట్లకు మాత్రం రెండవ దశ ఐపీఎల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న వివిధ జట్ల లో పలువురు విదేశీ ఆటగాళ్లు కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్నారు.




 ఇప్పుడు ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ లో కొంత మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్లో కరేబియన్ క్రికెటర్లకు ఎంత గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అరేబియన్ క్రికెటర్లు ఆడతారా లేదా అన్న దానిపై గత కొన్ని రోజుల నుంచి అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఇటీవలే వెస్టిండీస్ క్రికెటర్ లకు మార్గం సుగమం అయిందని తెలుస్తుంది.  బీసీసీఐ విజ్ఞప్తి మేరకు కరేబియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ను ముందుకు జరిపేందుకు వెస్టిండీస్ బోర్డు అంగీకరించిందట. దీంతో ఇక ఐపీఎల్ లో  వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు మరోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl