మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాల లాగానే క్రీడా రంగం కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే అనేక రకాల క్రీడలు రద్దయ్యాయి. అయితే ఇప్పట్లో కరోనా వైరస్ పూర్తిగా  తొలగిపోయే పరిస్థితులు లేవు. కాబట్టి ఇక ఆటగాళ్లను క్వారంటైన్ లో  ఉంచి అన్ని రకాల క్రీడలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ లు కూడా ప్రారంభమయ్యాయి ఇక అన్ని దేశాల క్రికెట్ జట్లు ఇతర దేశాల పర్యటనకు వెళుతున్నాయి. ఏ దేశ పర్యటనకు వెళ్లిన క్వారంటైన్ లోనే ఉంటూ మ్యాచ్లు ఆడుతున్నాయి. కరోనా వైరస్  పరిస్థితుల్లో ఎంతో కఠిన నిబంధనలు మధ్య ఆటగాళ్లు మ్యాచు ఆడుతున్న విషయం తెలిసిందే.



 అయితే ఆటగాళ్లందరూ బయో బబుల్ పద్ధతిలో కఠిన నిబంధనలు మధ్య మ్యాచ్ లు ఆడుతున్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం వదలడం లేదు. ఏకంగా బయో బబుల్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ సోకుతుంది. గతంలో  బిసిసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఐపీఎల్ కూడా ఇలా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడే పరిస్థితి వచ్చింది .. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో బయో బబుల్ లోకి కరోనా ప్రవేశించింది. దీంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేసింది బిసిసీఐ. ఇక ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి కూడా ఇలాంటి కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లండ్ జట్టులో వరుసగా ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారిపోయింది.



 ఇంగ్లాండ్ జట్టులోని ఏడుగురు సభ్యులకు వైరస్ సోకినట్లు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఏడుగురిలో ముగ్గురు ఆటగాళ్లు ఉండగా నలుగురు మేనేజ్మెంట్ సిబ్బంది ఉన్నారు అంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయోమయంలో పడిపోయింది. గురువారం నుంచి ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్తో వరుసగా సిరీస్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాళ్లు వైరస్ బారిన పడడంతో కీలక నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. కరోనా వైరస్ కారణంగా గురువారం నుంచి పాకిస్థాన్తో జరిగే వన్డే జట్టులో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. కాగా అటు ఆగస్టు 4 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: