ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం భారత జట్టు టెస్టు సిరీస్ లో  అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం మొత్తం విఫలం అవుతున్న వేళ అటు హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ మాత్రం మొదటి నుంచి టీమిండియాను గట్టెక్కించడానికి కీలకపాత్ర వహిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కీలక సమయంలో వికెట్లు పడగోడుతూ జట్టు విజయంలో ప్రముఖ పాత్రధారిగా మారిపోతున్నాడు.  తనదైన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను తక్కువ పరుగులకే కట్టడి చేయడమే కాదు ఇక  వరుసగా వికెట్లను పడగొడుతున్నాడు సిరాజ్.  ఇలా ప్రస్తుతం ఇక టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా సిరాజ్ సూపర్ హీరోగా అవతారం ఎత్తుతున్నాడు.



 ఇక ఇటీవల జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ఏకంగా 39 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టాడు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్ ఉన్నప్పటికీ మహమ్మద్ సిరాజ్ రికార్డును బద్దలు కొట్టి అందరి చూపు ఆకర్షించడం గమనార్హం. ఇక లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఏకంగా ఎనిమిది వికెట్లు తీశాడు  తొలి ఇన్నింగ్స్లో కీలకమైన నాలుగు వికెట్లు తీసి అదరగొట్టిన మహమ్మద్ సిరాజ్..  సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే జోరును కొనసాగించాడు. రెండో ఇన్నింగ్స్ లో మరోసారి నాలుగు వికెట్లు తీశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఒక ఇండియన్ బౌలర్ ఇలా ఎక్కువ వికెట్లు తీయడం ఇది రెండవ సారి మాత్రమే కావడం గమనార్హం.



 39 ఏళ్ల తర్వాత ఇక ఈ రికార్డును మహమ్మద్ సిరాజ్ బద్దలు కొట్టాడు. ఇంతకుముందు 1982లో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించాడు. 1982లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి అరుదైన రికార్డు సాధించాడు కపిల్ దేవ్. ఇక ఇప్పుడు  సిరాజ్ కూడా ఇదే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అప్పుడు కపిల్ దేవ్ కీలకమైన వికెట్లు పడగొట్టినప్పటికీ టీమిండియా మాత్రం ఓటమి చవిచూసింది. ఇక ఇప్పుడు మాత్రం టీమిండియా ఘనవిజయం సాధించడం గమనార్హం. ఇదిలా ఉంటే 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్ లలో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా పడకుండా పేలవ ప్రదర్శన చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: