టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వరల్డ్ క్రికెట్లో రికార్డుల కింగ్ గా పేరు సంపాదించుకున్నాడు. ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలో బ్రేక్ చేసి తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు ఇక తాను కూడా ఒక లెజెండ్ అన్న విషయాన్ని ఈ రికార్డులతో నిరూపిస్తూ ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ విషయంలో నేటితరం స్టార్ క్రికెటర్లకు ఎవ్వరికీ కూడా అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది స్టార్క్ ప్లేయర్లు ఉన్న కేవలం విరాట్ కోహ్లీని ఇష్టపడే ప్రేక్షకులే  కోట్లల్లో ఉన్నారు. అయితే ఇలాంటి ఫాలోయింగ్ ఉంది కాబట్టే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కోట్ల ఆదాయం పొందుతూ ఉంటాడు అని చెప్పాలి. అయితే అలాంటి విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఇంస్టాగ్రామ్ లో ఏదైనా వాణిజ్య ప్రకటనకు సంబంధించి  ఒక్క పోస్ట్ పెడితే ఏకంగా 11 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఈ న్యూస్ ప్రపంచం మొత్తం చుట్టేసింది. చివరికి విరాట్ కోహ్లీ ఈ వార్తపై స్వయంగా స్పందిస్తూ ఇందులో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.


 ఇక ఇప్పుడు కోహ్లీకి సంబంధించిన మరో వార్త కూడా ఇంటర్నెట్లో తీగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. మహారాష్ట్ర ఆలీ బాగ్ లోని విరాట్ కోహ్లీ ఫామ్ హౌస్ లో కోహ్లీ ఒక పిచ్ తయారు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మరోసారి స్పందిస్తూ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి. చిన్నప్పటి నుంచి నేను వార్తాపత్రికలను చదువుతున్నాను. కానీ ఇప్పుడు తప్పుడు వార్తలను ప్రచురించడం మొదలుపెట్టారూ. తాను పిచ్ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ అటు ఈనెల చివరిలో ప్రారంభం కాబోయే ఆసియా కప్ కోసం సిద్ధమవుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: