దేశంలో రోజు రోజుకీ క్రైమ్ శాతం పెరిగిపోతోంది. లెక్కకు మించి కేసులు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. సుప్రీమ్ కోర్టు సైతం ఈ కేసులను పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కేసులలో చాలా రకాల కేసులు ఉంటాయి. కానీ క్రైమ్ కు సంబంధించిన కేసులను చేధించాలంటే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్ పోలీసులు అటువంటి ఒక టెక్నాలజీని ఉపయోగించి ఒక కేసులో నేరస్థులైన వారిని పట్టుకుని విజయం సాధించారు. మాములుగా పోలీసులు ఉపయోగించే వివిధ టెక్నాలజీలలో ఈ డాగ్ స్క్వాడ్ కూడా ఒకటి. ఈ విభాగంలో కుక్కలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇవి నేరస్థుల వాసనను పసిగట్టడం ద్వారా పోలీసులకు సహాయం చేస్తాయి. గుజరాత్ లోని వడోదర పోలీసు డాగ్ స్క్వాడ్ లో ఉన్న ఒక కుక్క కేవలం 20 నిముషాలలోనే ఆరుగురు నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సహాయం చేసింది.

ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. మాములుగా మనము సినిమాలలో ఎక్కువగా ఇలాంటివి చూస్తుంటాము. వివరాల్లోకి వెళితే ఈ నెల 16 వ తేదీన గుజరాత్ కర్ణన్ తాలూకా దేహన్ గ్రామంలో 30 సంవత్సరాల వయసున్న మహిళపై ఒక గ్రూప్ కలిసి అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఈ విషయం ఆ రోజే సంబంధిత ఏరియాలో కేసు ఫైల్ అయింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వడోదర లోని స్నిప్పర్ డాగ్ జావా సహాయంతో నేరం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ కుక్క సహాయంతో త్వరగానే ఆ గ్రూప్ లో ఒకరైన బహదూర్ గిర్దారం ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సూపర్ డాగ్ నేరస్థులు ఉపయోగించిన బాటిల్ మరియు ఒక వస్త్రాన్ని వాసన బట్టి పారిపోయిన మిగిలిన నేరస్థులను దొరికేలా చేసింది.  

దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు పోలీసులను ఆ కుక్క తీసుకెళ్లి కేవలం 20 నిముషాల వ్యవధిలోనే ఆ నేరస్థులను పట్టుకుంది. గుజరాత్ లో ఇలా కుక్క నేరస్థులను పట్టించడం ఈ 45 రోజుల్లోనే మూడవ సారి కావడం విశేషం. ఇది తెలిసిన నెటిజన్లు ఆ కుక్కను సూపర్ డాగ్ అంటూ కితాబిచ్చారు. ఇకనైనా మిగిలిపోయిన నేరస్థుల కేసుల విషయంలో కుక్కలను వాడండి అంటూ ప్రజలు పోలీసు లకు సలహాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: