ఇక  ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్యూటీ ఆర్టికల్ చదవండి..... సాధారణంగా ప్రతి ఒక్కరూ మృదువైన, సున్నితమైన, మరియు మచ్చలులేని మెరిసే చర్మం కోసం ఆరాటపడుతున్నారు. మనలో ప్రతి ఒక్కరూ బిజీ షెడ్యూల్, క్రమరహిత ఆహారపు అలవాట్లు, సరిపడనంత నిద్ర, కాలుష్యం వంటి వాటి వల్ల మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని సాధించడం కష్టంగా ఉంది. కానీ అది అసాధ్యం కాదు. అందం మరియు చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు ఏవైనా సహజసిద్ధమైన ఉత్పత్తులకు సాటిరావు. కాబట్టి, ప్రకాశవంతమైన, మెరిసే చర్మం కోసం మీ వంటగదిలోని పదార్ధాలతో సులభంగా ఈ ఫేస్ మాస్క్ ని తయారు చేసుకుని ఉపయోగించి చూడండి.

మొటిమల, మచ్చల నివారణకు మాస్క్..

మొటిమలతో బాధపడే టీనేజర్లు కెమికల్స్‌తో నిండిన ఉత్పత్తులను పక్కన పెట్టి, ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించడం ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు.

కావలిసిన పదార్థాలు....

ఒక టీ స్పూన్ - పసుపు
ఒక టీ స్పూన్ - వేపాకు పొడి
2 టీ స్పూన్లు - ముల్తానీ మట్టి
అర టీ స్పూన్ - మంజిష్ఠ
3-4 టీ స్పూన్లు - పాలు
ఒక టీ స్పూన్ - నీళ్ళు

తయారీ విధానం...

ఒక గిన్నెలో అన్ని పదార్థాలను తీసుకుని బాగా కలపండి. దాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో ముంచిన రుమాలుతో తుడవాలి. మంచి ఫలితాల కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 3,4 సార్లు వాడండి.

ఈ చిట్కాల్లో సహజమైన పదార్ధాలను ఉపయోగించినప్పటికీ, మీకు ఏదైనా పదార్ధం అలెర్జీ కలిగిస్తుందో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది. అందువల్ల, ఈ చిట్కాలను ప్రయత్నించే ముందు మీ చేతిపై లేదా తొడలపై ప్యాచ్ టెస్ట్ చేయండి.అని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఇలాంటి సౌందర్య చిట్కాల ఆర్టికల్స్  కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: