విశాఖలో గ్యాస్ లీక్ఘటనపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్కు ఫోన్ చేశారు. ప్రమాద పరిస్థితి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటన వివరాలను సీఎం మోదీకి వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తీసుకున్న సహాయ చర్యలను కూడా ఆయనకు తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని జగన్ మోదీకి వెల్లడించారు. ఇక మోదీ సైతం ఈ ప్రమాదంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఉందంటే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇక ఏపీ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా సీఎంకు ఫోన్చేశారు. ప్రమాదకారణాలు సహా, సహాయక చర్యలను సీఎం ఆయనకు వివరించారు.