జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభ‌మైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం దీన్ని ప్రారంభించారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా క‌శ్మీర్‌లో పర్యటిస్తుండ‌టం ఇదే మొద‌టిసారి. శ్రీనగర్ విమానాశ్రయం టెర్మినల్ 25000 చదరపు మీటర్ల నుంచి 63000చదరపు మీటర్లకు విస్తరించడంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈమేర‌కు కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివ‌రాలు వెల్ల‌డించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల కోసం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కేంద్రమంత్రి అమిత్షా అధికారులను ఆదేశించ‌డంతోపాటు ప్ర‌యాణికుల కోసం ఏర్పాటు చేసిన అన్నిసౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కశ్మీర్ లోయలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయ‌డంతోపాటు కీలకప్రాంతాల్లో షార్ప్ షూటర్లు, పోలీసు జాగిలాలను మోహరించారు. ఉగ్రదాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్ సిటీ సెంటరు నుంచి లాల్ చౌక్ వరకు ఎయిర్ ఫోర్స్ ద్వారా గగనతలంపై నిఘా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: