ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే చాలామంది పోస్టాఫీసు ప్రవేశపెట్టిన పథకాలలో చేరాలి.. డబ్బులు ఆదా చేసుకోవాలి అని.. వారికి ఆలోచన ఉన్నప్పటికీ , ప్రతి నెల డబ్బులు కట్టాలి అంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ మరో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో కేవలం ఒకసారి డిపాజిట్ చేసి వదిలేస్తే చాలు , నిర్దిష్ట సమయం తర్వాత మీకు ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి. అయితే ఆ పథకం ఏమిటి..? దాని వివరాలు ఏమిటో..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పథకం ఏదో కాదు మంత్లీ ఇన్కమ్ స్కీమ్.. ఇందులో జాయిన్ అయిన మొదటి సారి 50 వేల రూపాయలను ఇన్వెస్ట్ చేసి  వదిలేస్తే సరిపోతుంది. అంతే కాదు ఇందులో 6.6 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. ఇక ప్రతి సంవత్సరం 3,300 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదే మీరు ప్రతి నెల డబ్బులు పొందాలి అనుకుంటే రూ.4.5 లక్షలు జమ చేస్తే సరిపోతుంది..ప్రతినెల 2,500 రూపాయలను పొందవచ్చు. లేదా ఒకేసారి ఇంత డబ్బు జమ చేయలేము అని అనుకునే వారు ప్రతి నెల 1000 రూపాయలను కనిష్టంగా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఇలా తక్కువ కాలంలో ఎక్కువ రాబడిని కూడా పొందే అవకాశాలు ఉంటాయి . కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఈ పథకంతో భవిష్యత్తులో ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవచ్చు. అయితే మీరు కూడా ఈ పథకంలో ముగ్గురు పార్ట్ నర్ లతో కలిసి కూడా చేరవచ్చు. అయితే రూ.9 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకంలో చేరాలనుకునే వారు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: