మనుషులు మనుషుల్లా ఉండడం లేదు. నరరూప  రాక్షసుల్లా మారిపోతున్నారు. ఎందుకంటే  మనుషుల ప్రాణాలకు ఎంతో విలువ ఇచ్చే వారు ఇప్పుడు మాత్రం సాటి మనుషుల ప్రాణాలు తీయడంలో కాస్తయినా వెనకడుగు వేయడం లేదు. వెరసి రోజురోజుకు హత్యలకు సంబంధించిన ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకే సాటి మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు ఎంతోమంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు రోజు లాగానే ఉదయం సమయంలో వాకింగ్ కి వెళ్ళాడు. కానీ అక్కడే మృత్యువు ఎలాంటి శత్రువులు కాచుకుని కూర్చున్నారు అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. చివరికి ఇలా వాకింగ్ కు వెళ్లిన యువకుడిపై కొంతమంది కత్తులతో దారుణంగా దాడి చేయడంతో రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు సదరు యువకుడు. ఈ ఘటన కాస్తా స్థానికులు అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. రాజస్థాన్లోని వెలుగులోకి వచ్చిన ఈ ఘటన. అమర్ కాలనీలో ఉండే తబిష్ అనే యువకుడు సంజయ్ నగర్ లో వాకింగ్ కు వెళ్ళాడు.

 అనుకోని విధంగా అక్కడ కొంత మంది యువకులతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే  ఇక కొంతమంది యువకులు తబిష్ పై మూకుమ్మడిగా దాడికి యత్నించారు. ఆ తర్వాత కత్తి తీసుకొని విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇక వెంటనే అక్కడి నుంచి పారిపోయారు అందరు యువకులు. అయితే రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తబిష్ ను చూసి వెంటనే భయపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాధితుడూ చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసాడు. అయితే ఇక సదరు యువకుడిపై దాడి చేసిన ఐదుగురిలో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: