ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూస్తున్న కూడా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతుండగా.. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి నెలకొంది. ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. ఇక ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.


 అయితే ఈసారి ఎన్నికల ప్రచారాలలో అటు శని సెలబ్రిటీలు భాగం కావడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ మారింది అని చెప్పాలి. తమ బంధువులకు ఆత్మీయులకు మద్దతుగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తోడుగా ఎంతోమంది సెలబ్రిటీలు ప్రచారం చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ సైతం ఇలా ఎన్నికల ప్రచార రంగంలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామ సహాయం రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.


 ఈయన ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు అన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నేతలను కాదని పొంగులేటి పట్టుబట్టి మరి ఖమ్మం టికెట్ ను తన వియ్యంకుడురఘురామిరెడ్డికి ఇప్పించుకున్నాడు. అయితే ఇక ఈయన తరపున హీరో వెంకటేష్ ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఎందుకంటే రామసహాయం రఘురామిరెడ్డి అటు హీరో వెంకటేష్ కి కూడా వియ్యంకుడు కావడం గమనార్హం.  వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితను రఘురామిరెడ్డి కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. దీంతో వరుసకి రఘురాంరెడ్డి వెంకటేష్ బావ బావమరుదులు అవుతారు. ఈ క్రమంలోనే  పార్లమెంట్ ఎన్నికల్లో వియ్యంకుడు రఘురాంరెడ్డి విజయం కోసం వెంకటేష్ ప్రచార నిర్వహించబోతున్నారు. మే 7వ తేదీన ప్రచార రంగంలోకి దిగబోతున్నారు అన్నది తెలుస్తోంది. సాధారణంగా అయితే వెంకటేష్ రాజకీయాలకు ఎంతో దూరం ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: