ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా మారాడు అల్లు అర్జున్. అయితే గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్పా సినిమా మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల పరంగా సునామిక్స్ సృష్టించింది.

ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాక్పాట్ కొట్టాడు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా ఇటీవల ఈ సినిమా నుండి టీజర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సైతం రికార్డును బ్రేక్ చేసింది. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టు సినిమాకి సంబంధించిన ఓటిటీ రైట్స్ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాయి అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ సైతం భారీగా పెంచేశాడు అని అంటున్నారు.

అయితే ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపించాయి. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా అనుకున్న సమాచారం మేరకు అట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్ తో తన నాలుగవ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  అల్లు అర్జున్ ఎప్పటిలా కాకుండా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను పక్కనపెట్టి ఫాంటసీ టచ్ ఉన్న భారీ సబ్జెక్టుని రెడీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: