ఇవాళ తెలంగాణకు రానున్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:40కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రానున్న అమిత్‌ షా.. రోడ్డు మార్గం ద్వారా లాల్‌ దర్వాజకు చేరుకుంటారు. భాజపా హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాధవిలత తరపున ప్రచారం చేస్తారు.


రాత్రి 8 నుంచి 9 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొననున్న అమిత్‌ షా.. రోడ్‌ షో ముగించుకుని నేరుగా భాజపా రాష్ర్ట కార్యాలయానికి వెళ్తారు. రాత్రి 9:15 నుంచి 10:15 వరకు భాజపా రాష్ర్ట కార్యాలయంలో ముఖ్య నేతలతో అమిత్‌ షా సమావేశం అవుతారు. నాగర్‌ కర్నూల్‌, చేవెళ్ల, మహాబూబ్ నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశంకానున్న అమిత్‌ షా.. ఈ సమావేశం అనంతరం బేగంపేట ఐటీసీ కాకతీయకు రాత్రి 10:30కి చేరుకుంటారు. రాత్రి ఐటీసీ కాకతీయలోనే బస చేయనున్న అమిత్‌ షా.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: