టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనిలలో రీతు వర్మ ఒకరు. పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె అనేక తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఆఖరుగా తెలుగు లో ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ హీరో గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 

మూవీ తర్వాత ఈమె విశాల్ హీరో గా రూపొందిన మార్క్ ఆంటోనీ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈమె తక్కువ సినిమాల్లోనే నటిస్తున్నప్పటికీ అందులో ఎక్కువ శాతం సినిమాలో మంచి విజయాలను అందుకుంటూ ఉండటంతో ఈమె కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె "స్వాగ్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీ విష్ణు హీరో గా రూపొందుతున్న ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ లో రీతు వర్మ (రుక్మిణి దేవి) పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో ఈ బ్యూటీ కి సంబంధించిన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దానితో తాజాగా ఈమె స్వాగ్ మూవీ లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rv