రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం చివరన సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీ కి ఇండియాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ... జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి , బాబి సింహమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి రవి బస్రుర్ సంగీతం అందించాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా యొక్క రెండవ భాగం "శౌర్యాంగ పర్వం" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని రోజుల్లోనే సలార్ 2 సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇంతలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... భారీ అంచనాలు కలిగి ఉన్న సలార్ 2 సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు , ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ కనిపించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. నిజం గానే అమితా బచ్చన్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: