మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం వాల్టేరు వీరయ్య , భోళా శంకర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పోయిన సంవత్సరం మొదటగా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన వాల్టేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత విడుదల అయిన భోళా శంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. భోళా శంకర్ మూవీ తో భారీ ఫెయిల్యూర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న చిరంజీవి ప్రస్తుతం బింబిసారా ఫేమ్ మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

త్రిష ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా నటిస్తూ ఉండగా ... యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాన్ని ఈ మూవీ బృందం చిత్రీకరిస్తుంది.

ఇందులో చిరంజీవి తో పాటు త్రిష కూడా పాల్గొంటుంది. ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ఇంటర్వెల్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా ఇంటర్వెల్ లో ఒక పెద్ద ట్విస్ట్ రీవిల్ కాబోతుంది అని , ఈ సీన్ లో చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు రివిల్ చేయబోతుంది అని తెలుస్తుంది. అలాగే ఈ ఇంటర్వెల్ సన్నివేశం లో వచ్చే యాక్షన్ సన్నివేశం కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు , ఈ యాక్షన్స్ సన్నివేశంలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా బలంగా ఉండేలా దర్శకుడు ఫుల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: