తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో రాశి కన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈమె మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక ఈ బ్యూటీ గత కొంత కాలంగా తమిళ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే అరణ్మనై 3 , సర్దార్ సినిమాలలో నటించింది. ఇందులో కార్తీ హీరో గా రూపొందిన సర్దార్ మూవీ మంచి విజయం సాధించింది.

అరణ్మనై 3 యావరేజ్ అయినప్పటికీ ఇందులో రాశి కన్నా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు మూవీ లతో మంచి గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ బ్యూటీ సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ "అరణ్మనై 4" సినిమాలో నటించింది. ఈ మూవీ మే 3 వ తేదీన విడుదల కానుంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించింది. ఈ మూవీ తెలుగు లో బాక్ అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో కూడా మే 3 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రాశి కన్నా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అరణ్మనై 4 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాసి కన్నా మాట్లాడుతూ ... సుందర్ సి తనను పిలిచినప్పుడు స్క్రిప్ట్ వినలేదు అని, ఫ్రాంచైజీలో భాగం కావాలని కోరుకున్నట్లు తెలిపింది. మరి ఈ మూవీ తో రాసి కన్నా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk