ఇండియాలో మంచి గుర్తింపు కలిగిన నటులలో అనుపమ్ ఖేర్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి తన నటనతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈయన వరుసగా తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. కొంత కాలం క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న "కార్తికేయ 2" సినిమాలో ఈయన ఓ కీలకమైన పాత్రలో నటించాడు.  అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో చాలా తక్కువ నడివి ఉన్న పాత్రలోనే కనిపించినప్పటికీ ఆ పాత్రకు అద్భుతమైన గుర్తింపు ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో ఈయన పాత్ర నిడివి ఎక్కువ గానే ఉంది. అలాగే అనుపమ్ ఖేర్ గారి పాత్రకు ప్రాధాన్యత కూడా ఎక్కువ గానే ఉంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అయినప్పటికీ అనుపమ్ ఖేర్ మాత్రం ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన తన సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అనుపమ కేర్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ... నాకు ఇష్టమైన వ్యక్తుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయనను ఈ రోజు కలిశాను. అతన్ని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అతని తీరును నేను ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాను. ఎన్టీఆర్ మరింత ఎదగాలని కోరుకుంటున్నాను అని అనుపమ్ ఖేర్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. తాజాగా అనుపమ్ ఖేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: