సాధారణంగా రైతులు పంట వేసిన తర్వాత ఆ పంటను రక్షించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక వైపు నుంచి అడవి పందులు మరో వైపు నుంచి పక్షులు.. ఇంకో వైపు నుంచి పొలంలో ఎలుకలు.. ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇబ్బందుల నుంచి తన పంటను రక్షించుకోవడానికి కొన్ని కొన్ని సార్లు పొలం చుట్టూ కరెంటు తీగలను అమర్చడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు పొలంలో ఎలకల బెడదను నివారించేందుకు ఎలకల మందు పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా రైతులు పంట పొలానికి రక్షణ కల్పించేందుకు చేసిన పనులు కొన్ని కొన్ని సార్లు ఊహించని ఘటన లకు కారణం అవుతూ ఉంటాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ రైతు పొలంలో ఎలుకల బెడద చాలా ఎక్కువైపోయింది. ఎలకల  కారణంగా పంట నష్టం కూడా వాటిల్లుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఇక ఎలకల మందు పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక ఎలకల కోసం పెట్టిన మందు కాస్త నెమల్లు తిని చివరికి మృతి  చెందాయి. ఇక ఈ ఘటనలో ఏకంగా 12 నెమళ్లు మృతి చెందడం సంచలనంగా మారిపోయింది. తమిళనాడులో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.


 తమిళనాడులోని తిరుపత్తూరు సమీపంలో ఉన్న కురన్ పత్తి గ్రామానికి చెందిన షణ్ముగం అనే రైతు తన పొలంలో వరి పంట వేశాడు. ఇటీవల కాలంలో వరి పొలంలో ఎలుకల బెడద ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే ఎలుకలను చంపడానికి ఎలకల మందు  పెట్టాడు. కానీ అదే సమయంలో పొలంలోకి వచ్చిన నెమళ్లు ఆ రైతు పెట్టిన ఎలకల మందు తినేసాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఒకేసారి 12 నెమళ్లు మృతి చెందడం సంచలనంగా మారిపోయింది. పోలీసులకు సమాచారం వెళ్ళింది. ఇక అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక రైతు షణ్ముగాం ను అరెస్టు చేసి విచారణ మొదలు పెట్టారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: