
ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. గ్రామంలో ఓ మహిళా, యువకుడు వేరు వేరు చోట్ల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నలుగురు పిల్లలు ఉన్న ఓ మహిళ 17 ఏళ్ల యువకుడు తో ప్రేమ వ్యవహారం కొనసాగించడం మొదలు పెట్టింది. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. దీంతో ఆ మహిళను అవమానించడం మొదలు పెట్టారు గ్రామస్తులు. దీంతో మనస్తాపం చెందిన సదరు మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ విషయం తెలిసిన 17 ఏళ్ల బాలుడు కూడా మరో ప్రాంతంలో ఉరివేసుకున్నాడు.
అయితే సదరు మహిళ భర్త ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే ఒంటరితనాన్ని భరించలేక సదరు మహిళ 17 ఏళ్ల యువకుడు తో ప్రేమ వ్యవహారం కొనసాగినట్లు తెలుస్తోంది. మృతురాలికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు. కాగా ఇక మృతుడు పింటూ కశ్యప్ 9వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..