బ్యాడ్ న్యూస్
పసిడి ధరలు నిన్న కాస్త ఊరట నిచ్చిన సంగతి తెలిసిందే.. నేటి
మార్కెట్ లో రేట్లు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. ఇది నిజంగానే మహిళలకు చేదు వార్తనే చెప్పాలి..బంగారం బంగారం ధర పెరిగితే..
వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. మరోవైపు గ్లోబల్ మార్కె్ట్లో బంగారం,
వెండి ధరలు పెరిగాయి.బంగారం ధర కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్ లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో రూ.47,780కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 పెరుగుదలతో రూ. 43,800కు ఎగసింది.
ఇకపోతే బంగారం ధరలు పైకి కదిలిన, తగ్గిన వెండి మాత్రం గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇకపోతే
అంతర్జాతీయ మార్కెట్ లో
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది.బంగారం ధర ఔన్స్కు 0.16 శాతం పెరుగుదలతో 1738 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే
వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్కు 0.24 శాతం పెరుగుదలతో 25.58 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం,
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు,
కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ
మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు ఆభరణాల తయారీ మొదలగు వంటి అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి. మరి రేపు
మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..