సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ఆత్రం ఆత్రంగా ఇంకా మనకు అన్నం దొరకదు అనే రీతిలో చాలా వేగంగా తినేస్తారు.ఆఫీస్ వర్క్స్, ఇంటి పనులు, ఇతర పనులు ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో మనమీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మల్టీలెవల్ వర్క్స్ చేస్తున్నారు. అంటే ఉన్న సమయంలోనే రెండు, మూడు పనులు చేయడం. ఇలా చేస్తుంటారు. దీని వల్ల ఎవరి పనులు వారికి చేసుకోవడానికి కూడా సమయం ఉండదు. భోజనం చేయడం, ఇతర పనులు చేయడం వంటికి కూడా సమయం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో భోజనం కూడా ఏదో తిన్నామంటూ తినేస్తుంటారు.కానీ అలా తినటం వలన ఎన్ని సమస్యలు వస్తాయో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి....

త్వరగా భోజనం చేసే సమయంలో మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామనేది తెలియదని, దీని వల్ల ఎక్కువగా ఆహారం తెలియకుండానే తీసుకుంటామని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. అయితే నెమ్మదిగా తినాలని మరీ నెమ్మదిగా తినకూడదు.వేగంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే సమస్యలు వున్నాయి. అవును కొంతమంది తినేటప్పుడు అన్నాన్ని సరిగ్గా నమిలి తినరు. మింగేస్తుంటారు. దీని వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు మెల్లిగా నమిలి తినాలని దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా.. త్వరగా తినడం వల్ల అసిడిటీ సమస్యలు కూడా వస్తాయని, అందుకోసం ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు.

షుగర్ వచ్చే ప్రమాదం వుంది..ఇక మరో ముఖ్య సమస్య ఏంటంటే.. వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఆహారాన్ని నిదానంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు. అయినా ఎంత సంపాదించినా.. మన కడుపుకోసమే.. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏముంది.. మరి ఆ ఆరోగ్యం కోసం ఆ మాత్రం నిదానంగా తినలేమా.. ఆహారాన్ని ఆస్వాదించలేమా.. ఆలోచించండి..




మరింత సమాచారం తెలుసుకోండి: