ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటిగా మారింది. మూత్రాశయం ఇంకా కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం.మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం ఇంకా మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కనిపించే అతి సాధారణ లక్షణాలు.ఇక కాల్షియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినే వారి కంటే తక్కువగా తినే వారికే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా కాల్షియం అనేది అడ్డుకుంటుంది.ఇందుకోసం అది చాలా రకాల రసాయనాలతో మిళితమై పనిచేస్తుంది.కిడ్నీ స్టోన్స్ మొదటి దశలో పొట్ట కింది భాగంలో లేదా వెన్నులో చాలా నొప్పిగా ఉంటుంది. అయితే ఈ నొప్పి ఒక్కోసారి తక్కువగా, ఒక్కో సందర్భంలో ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం తక్షణమే డాక్టర్ ని సంప్రదించాలి.కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి మూత్రం రంగు కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రాళ్లు మూత్రశాయంలో అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల  మూత్రం రంగు మారి అలాగే బయటికి వస్తుంది. పైగా ఇది ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది.


మూత్రాశయంలోకి రాళ్లు వస్తే అవి ఆ అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఇంకా అంతేకాదు దీని వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లినప్పుడల్లా నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఇంకా లైంగిక వ్యాధుల వంటి ప్రమేయం కూడా ఉంటుంది.అయితే మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పైగా కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది.ఇక కిడ్నీస్టోన్స్ ఉంటే ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా ఎక్కువగా వస్తుంది. అయితే ఇది ఎరుపు రంగులో కాక ఎరుపు, పసుపు మిక్స్ చేసిన డార్క్ రంగులో కూడా కనిపిస్తుంది.కుటుంబంలో, వారి రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్లు ఉంటే వారి నుంచి వారి పిల్లలకు కూడా అవి వచ్చేందుకు ఎక్కువ అవకాశం  ఉంటుంది.అలాగే ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిలో డయేరియా ఉన్నవారు కూడా ఉంటే అది ఖచ్చితంగా డీహైడ్రేషన్‌కు దారి తీసి కిడ్నీ స్టోన్లు ఏర్పడేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: