టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు రీమేక్ సినిమాలు ఒకేసారి చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ముఖ్యంగా తన రీ ఎంట్రీ లో ఇప్పటి వరకు ఆయన మూడు సినిమాలను చేయగా అందులో ఒక సినిమా రీమేక్. మళ్లీ ఇప్పుడు ఓ మూడు సినిమా లను సెట్స్ పైకి తీసుకు వెళ్తుండగా అందులో రెండు సినిమాలు రీమేక్ సినిమాలే కావడం గమనార్హం. ఈ విధంగా రీమేక్ లపై మెగాస్టార్ చిరంజీవి తన ప్రేమను చాటి చెబుతున్నాడు.

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కి రీమేక్ సినిమాలు చేయవలసిన అవసరం లేదు. కానీ ఆయన రీమేక్ సినిమాలను ఎందుకు ఎంచుకుంటున్నాడు అనేది ఆయనకే తెలియాలి. ప్రస్తుతం చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న నేపథ్యంలో మలయాళంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు ఇది రీమేక్.  మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక వేదాళం సినిమా కు రీమేక్ గా భోళా శంకర్ సినిమా ను మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ విధంగా 2 రీమేక్ సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళుతున్నాడు చిరు. 

ఇకపోతే బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న అనే సినిమాను డైరెక్ట్ తెలుగు సినిమా కాగా ఆ తర్వాత ఆయన సీక్వెల్ సినిమాలను చేయడానికి డిసైడ్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఆయన సీక్వెల్ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట చిరు.  మరి ఆ తర్వాత ఏ సినిమాకు సీక్వల్ మొదలు పెడతాడు చూడాలి. ఇక ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ఆశ్చర్య విడుదలకు సిద్ధంగా ఉంది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత కాగా ఆయన ఓ ముఖ్య పాత్రలో కూడా నటించాడు. కాజల్ పూజ హెగ్డే లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల అవుతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: