తేజ దర్శకత్వంలో 'హోరాహోరి' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది దక్ష నగార్కర్‌ . తదుపరి హుషారు, జాంబి రెడ్డి, రావణాసుర చిత్రాలతో అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ బంగార్రాజు సినిమాలో ఓ పాటలో అలా వచ్చి ఇలా వెళ్లి పోయింది.కొందరు హీరోయిన్లు ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా వారికి తగినంత గుర్తింపు రాదు. టాలీవుడ్లో కూడా అలాంటి హీరోయిన్లు చాలామందే ఉన్నారు.ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా చేసింది ఐదు చిత్రాలే. ఇప్పుడు అవకాశాలు లేకపోయినా టాలీవుడ్‌ని విడిచిపెట్టలేదు. అప్పుడప్పుడూ ఏదో ఒక ఈవెంట్‌లో మెరుస్తూనే ఉంటుందీ బ్యూటీ. అప్పుడప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో, చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్న దక్ష.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తన హాట్ ఫోటోషూట్స్తో ఫాలోవర్స్ను ఎంటర్టైన్ చేస్తుంటుంది. అలాంటి దక్ష.. తాజాగా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్.. తన ఫ్యాన్స్ను షాక్కు గురిచేసింది. తనకు ఉన్న అనారోగ్య సమస్య గురించి, దానికోసం జరిగిన సర్జరీ గురించి ఈ పోస్ట్ ద్వారా బయటపెట్టింది దక్ష.

‘‘గత కొన్నిరోజుల నుంచి చాలా కష్టంగా గడుస్తోంది. ఒక సర్జరీ రూమ్ నిండా మనుషుల మధ్యలో స్ట్రెచ్చర్పై పడుకొని ఉండడం దగ్గర నుంచి.. నా వెన్నుముకను రెండుసార్లు సూది గుచ్చి అనెస్థిషీయా ఇవ్వడం వరకు.. అన్నీ కష్టంగా అనిపించాయి. వాటి నుంచి కోలుకోవడం మరింత కష్టంగా అనిపించింది. నా ఎమోషన్స్ అన్నింటిని హ్యాండిల్ చేయడానికి నేను విశ్వప్రయత్నాలు చేశాను. నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ పనిని నాకు సులువు చేశారు. ప్రేమించడం, ప్రేమించబడడం ఎలా ఉంటుంది అనేది వారు నాకు చూపించారు. కనిపించని గాయాలను నయం చేసే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుంది’ అంటూ తన సర్జరీ గురించి చెప్పుకొచ్చింది దక్ష నగార్కర.

‘ఇలాంటిది ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నాను. మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ చుట్టూ మిమ్మల్ని అమితంగా ప్రేమించే మనుషులు ఉండేలా చూసుకోండి. సంతోషరకమైన విషయాలను మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరూ దీని గురించి బాధపడడం నాకు ఇష్టం లేదు’ అంటూ కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది దక్ష నగార్కర్. అందులో తన చేతికి సెలైన్ ఎక్కుతున్న ఫోటో కూడా ఉంది. అయితే ఇంతకీ తనకు ఏ సమస్య వచ్చింది, సర్జరీ ఎందుకు జరిగింది లాంటి విషయాలను దక్ష బయటపెట్టలేదు. కానీ ఏదో ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతున్నట్టు మాత్రం ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది ఈ భామ.2014లో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దక్ష నగార్కర్. ఈ పదేళ్లలో తను కేవలం అరడజను సినిమాల్లో మాత్రమే నటించింది. యూత్ఫుల్ మూవీ ‘హుషారు’తో ప్రేక్షకుల్లో కాస్త గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘జాంబీ రెడ్డి’ ద్వారా దక్షకు మరింత రీచ్ లభించింది. ఇందులో తను హీరోగా నటించకపోయినా.. హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత నాగచైతన్య, నాగార్జున మల్టీ స్టారర్గా తెరకెక్కిన ‘బంగార్రాజు’లో ఒక చిన్న పాత్రలో కనిపించింది మరోసారి యూత్ను ఫిదా చేసింది. ప్రస్తుతం దక్ష నాగర్కర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: