ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు శ్రీముఖి. తన వాక్చాతుర్యంతో తన అందం అభీనయంతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేశాడు. ఇక బుల్లితెరపై ఎన్నో షోస్ చేస్తూ ప్రతి తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది శ్రీముఖి అనడంలో సందేహం లేదు. ఒకవైపు సినిమాల్లో ఆడపాదడపా అవకాశాలు అందుకుంటూనే ఇంకోవైపు అటు బుల్లితెరపై కూడా వివిధ షో లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇక గతంలో ఓసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గర అయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పుడు వరకు శ్రీముఖికి అటు సినిమాలలో పెద్దగా చెప్పుకోదగ్గా పాత్రలు మాత్రం రాలేదు. స్టార్ హీరోలకి చెల్లి పాత్రలో నటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు శ్రీముఖికి ఒక ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా వచ్చిన అవకాశాలను కొన్నింటిని ఆమె వదులుకుంటే.. మరికొన్ని మాత్రం ఇక ఆమె దగ్గరికి రాకుండానే వేరే హీరోయిన్స్ చేతికి వెళ్లిపోయాయట. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో శ్రీముఖి ఈ విషయాన్ని బయట పెట్టింది. మాస్ మహారాజ రవితేజ కెరియర్ లో బ్లాక్బస్టర్గా నిలిచిన సినిమా క్రాక్.


 శృతిహాసన్ ఇక ఈ మూవీలో హీరోయిన్గా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకుడు. అయితే ఈ మూవీలో భూమ్ బద్దలు అనే ఐటమ్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఈ ఐటమ్ సాంగ్ కోసం ముందుగా డైరెక్టర్ గోపీచంద్ శ్రీముఖిని అనుకున్నాడట. శ్రీముఖి అంతలా ఎక్స్పోజింగ్ చేయదు అని గోపీచంద్ తో పలువురు  చెప్పడంతో ఇక ఈ ఆఫర్ తో శ్రీముఖిని కలవకుండానే వేరే హీరోయిన్ చేతిలో పెట్టారట. అయితే ఆ తర్వాత ఓ ఈవెంట్ లో ఈ పాటకు పై శ్రీముఖి పర్ఫామెన్స్ చూసి షాక్ అయినా గోపీచంద్.. ఆ తర్వాత ఆమెకు కాల్ చేసి క్రాక్ సినిమా సమయంలో జరిగిన విషయం చెప్పుకొచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: