పాన్ ఇండియా హీరో గా మారిన తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే అవి సక్సెస్ ను సాధించడం లేదంతే. బాహుబలి తర్వాత ఆయన విడుదల చేసిన రెండు సినిమాలో డిజాస్టర్ లుగా మిగిలిపోయాయి. దాంతో ఈ సారి చేసే సినిమాలు సూపర్ హిట్ కొట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అందుకే ఆయన చేసే సినిమాలపై పూర్తి శ్రద్ధ పెడుతున్నాడు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన తదుపరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆది పురుష సినిమా.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటన ఇచ్చింది కూడా. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ఈ చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి కానీ ఎందుకో బజ్ మాత్రం క్రియేట్ అవడం లేదని కొంతమంది సినిమా విశ్లేషకులు చెప్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.

ఈనేపథ్యంలో ఈ సినిమా లో ఇన్ని విశేషాలు ఉన్నా కూడా బజ్ క్రియేట్ కాకపోవడం ప్రభాస్ అభిమానులను ఎంతో కలవరపరుస్తోంది. బహుశా బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమా కి ఇక్కడ బజ్ క్రియేట్ అవడం లేదని అనుకుంటున్నారు. అయిన టాలీవుడ్ హీరో నటిస్తున్న ఈ సినిమా కి మినిమమ్ బజ్ లేకపోవడం నిజంగా అందరిని కలవరపరిచే విషయమే. విడుదల సమయానికి ఈ చిత్రం యొక్క క్రేజ్ ను చిత్రబృందం పెంచుతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత సమ్మర్ లో సలార్ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా కు సంబందించిన విడుదల తేదీ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: