తాజాగా అడవి శేష్ హీరోగా, శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మాణంలో  తెరకెక్కిన తాజా సినిమా మేజర్.ఇకపోతే ఈ సినిమాని 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమానే మేజర్.  ఇకపోతే రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని భారీ విజయం సాధించి అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది ఈ సినిమా.అంతేకాకుండా  మేజర్ సినిమాపై ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే మేజర్ చిత్ర యూనిట్ పాఠశాల విద్యార్థులకు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది.

ఇక అదేంటంటే.... 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం గురించి పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో టికెట్‌ ధరపై 50 శాతం రాయితీ ఇస్తోంది. అంతేకాదు పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక షో కోసం majorscreening@gmail.com కి మెయిల్‌ చేస్తే మేజర్‌ టీమ్‌ ఆ స్కూల్ విద్యార్థులకు స్పెషల్ షో ఏర్పాటు చేస్తామని తెలిపారు.అయితే దీనికి సంబంధించి అడివిశేష్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.ఇకపోతే  ఈ వీడియోలో అడివిశేష్ మాట్లాడుతూ.. 'మేజర్‌ సినిమాకి ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. 

అంతేకాకుండా కొన్ని రోజులుగా చాలామంది చిన్నారులు నాకు ఫోన్‌ చేసి, సోషల్ మీడియాలో మెసేజ్ లు చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారు.ఇకపోతే  వాళ్లందరికీ కూడా మేజర్ సినిమా బాగా నచ్చింది. కాగా మేమూ మేజర్‌ సందీప్‌లా దేశం కోసం పోరాడతమని వాళ్ళు చెప్పడం సంతోషాన్నిచ్చింది. ఇక ఈ చిత్రం పిల్లలకు కూడా ఇంత బాగా నచ్చుతుందని మేము అనుకోలేదు. పొతే ఈ స్పందన చూసి మేం ఓ నిర్ణయం తీసుకున్నాం.అదేంటంటే  మరింతమంది విద్యార్థులు మేజర్‌ గురించి తెలుసుకుని స్ఫూర్తిపొందాలని, గ్రూప్‌ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాం. కాగా రేపటి తరానికి మేజర్‌ సందీప్‌ గురించి తెలియాలనేదే మా లక్ష్యం'' అని తెలిపారు....!!!!

మరింత సమాచారం తెలుసుకోండి: