భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కవలసిన చిత్రం మధ్యలోనే ఆగిపోవడం ఆ సినిమా యొక్క అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అప్పట్లో సంచలన రికార్డులను సృష్టించిన ఈ సినిమా మళ్లీ సీక్వెల్ తెరకెక్కుతుందన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలకు సీక్వెల్ చేయాలనే ఆలోచన రావడం నిజంగా ఎంతో గొప్పే అని చెప్పాలి.

అయితే ఈ సినిమాకు ఎప్పుడు లేని విధంగా ఇన్ని అవాంతరాలు రావడం అభిమానులను ఎంతగానో కలచి వేసింది.  భారతీయుడు సీక్వెల్ సినిమా ను ఆపడానికి ప్రకృతి సిద్ధమైనట్లుగా ఒక్కొక్క కారణం ఈ సినిమా ఆగిపోవడానికి కారణం అయ్యింది. తొలుత ఈ సినిమాలో జరిగిన ఓ క్రేన్ ప్రమాదం ఈ సినిమా ఆగిపోవడానికి ఒక కారణం కాగా ఆ తరువాత దర్శకుడు మరియు నిర్మాతల మధ్య పొసగక పోవడం ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం అయ్యింది. దాంతో ఇప్పుడు శంకర్ ఆ సినిమాను పక్కనపెట్టి తన తదుపరి సినిమాను రామ్ చరణ్ తో చేస్తున్నాడు. 

సినిమా షేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గత కొన్ని రోజులుగా కమలహాసన్ చెప్పేదాన్ని బట్టి ఈ సినిమాకు మళ్ళీ తిరిగి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించిన ఈ హీరో ఇప్పుడు ఈ సినిమాను మొదలు పెట్టాలని ఆలోచన చేయడం కమల్ అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.  ఈ నేపథ్యంలో ఆయన ఇది ఎంతవరకు సాధ్యం చేసి చూపిస్తారో చూడాలి. మరొకవైపు శంకర్ చరణ్ సినిమా తర్వాత అపరిచితుడు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తే అక్కడ కూడా అయన వేరే లెవెల్ లో సెటిల్ అయినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: