తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరుపొందాడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న సరే విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇక ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ భారీ డిజాస్టర్ ని చవి చుశారు. ఇదే చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదలై డిజాస్టర్ గా అవ్వడంతో కొద్దిరోజులపాటు విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉండిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జై జవాన్ కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు.
ప్రముఖ నేషనల్ ఛానల్ ప్రత్యేకంగా చేపట్టిన ఒక కార్యక్రమంలో విజయ్ దేవరకొండ దేశ సరిహద్దుల్లో జవాన్లను కలవడం జరిగింది. బారాముల్ల లోని నియంత్రణ రేఖకు దగ్గరలో ఉన్న యూరి సెక్టర్ ను సందర్శించి అక్కడ విధి నిర్వహణ పాల్గొన్న కొంతమంది జవాన్లను కలిసి వారితో ఫోటోలు దిగడం జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ జవాన్లతో పాటు ఆర్మీ జాకెట్ వేసుకొని తుపాకీ పట్టుకొని దిగిన కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.దీంతో అభిమానులు మాత్రం విజయ్ దేవరకొండ జనగణమన సినిమా కోసం ఇలా చేస్తున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే సమంత విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నది. కాని ఈ చిత్రం కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం కేవలం విజయ్ దేవరకొండ చేతిలో ఖుషి సినిమా మాత్రమే ఉన్నది ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరి చిత్రంతోనైనా సక్సెస్ అవుతారమే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: