టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో సినిమాసినిమాకు తారక్ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. 2021 సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. 
 
తారక్ ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తారక్ లీడింగ్ బిజినెస్ మేన్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. హారిక హాసిక క్రియేషన్స్, ఎన్టీయార్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 
 
అరవింద సమేత సినిమాలో త్రివిక్రమ్ తారక్ ను సరికొత్త పాత్రలో చూపించాడు. ఈ సినిమాలో మరోసారి తారక్ ను సరికొత్తగా చూపించబోతున్నాడని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయిన తారక్ కొత్త సినిమా షూటింగ్ లో జయిన్ కానున్నాడు. 2021 సమ్మర్ లేదా దసరా పండుగకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాతో ఎన్టీయార్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ప్రస్తుతం తారక్ ఇంటికే పరిమితమయ్యాడు. మూడు రోజుల క్రితం రాజమౌళి బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు నామినేట్ చేయగా తారక్ ఆ ఛాలెంజ్ ను స్వీకరించి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలను, దర్శకుడు కొరటాల శివను నామినేట్ చేశాడు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే తారక్ లాక్ డౌన్ వల్ల పూర్తి సమయాన్ని ఇంటికే కేటాయిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: