బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను ఒక్కసారి గా షాక్ కి గురిచేసింది. అంతే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో సుశాంత్ ఆత్మహత్య సంచలనంగా  మారిపోయింది. సుశాంత్ ఆత్మహత్య కు కారణం బాలీవుడ్ లో ఉన్న నేపోటిసమే  అంటూ కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖులు బాహాటం గానే విమర్శలు చేయడం... ఏకంగా బాలీవుడ్ సినీ ప్రముఖుల పై కేసులు కూడా నమోదు కావడం సంచలనం గా మారిపోయింది. సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్లో ఎంతో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఈ ఆత్మ హత్య కేసులో విచారణను ముమ్మరం  చేశారు. 

 

 ఇప్పటికే సుశాంత్ సింగ్   బంధువులను సన్నిహితుల ను  విచారించిన పోలీసులు... ఇటీవలే సుశాంత్ స్నేహితుల ను విచారించారు. ఇక బంధువులు స్నేహితులు విచారించి వారి నుంచి స్టేట్మెంట్ ను  స్వీకరిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారన్న  విషయం తెలిసిందే. ఇక రియా చక్రవర్తి నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ స్వీకరిస్తున్నారు. 

 


 రియా చక్రవర్తి విచారణ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను సుశాంత్ సింగ్ ని  పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా అని కానీ ఇంతలో నే ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపింది. అంతేకాకుండా సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందని.. అతని తో ఉన్నప్పుడు ఏవేవో శక్తులు ఉన్నట్లు అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. యశ్ రాజ్ ఫిలిమ్స్  లో రెండు సినిమాలు చేసిన సుశాంత్ ఆ తర్వాత మిగతా కాంట్రాక్టుల ను రద్దు చేసుకున్నారని తనను  కూడా ఆ బ్యానర్ పై  సినిమాలు చెయ్యొద్దు అంటూ సూచించాడు అంటూ చెప్పుకొచ్చింది సుశాంత్ ప్రియురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: