క్రేజీ హీరో విజయ్ దేవరకొండ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ మ్యాన్’ టైటిల్ కు  మూడవసారి ఎంపిక కావడంతో అతడికి యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం అవుతుంది. గత కొంతకాలంగా విజయ్ కు సరైన హిట్ లేదు. అయినప్పటికీ అతడి క్రేజ్ యూత్ లో ఏమాత్రం తగ్గలేదు అన్నసంకేతాలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో విజయ్ దేవరకొండకు స్థానం రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. డబూ రత్నాని క్యాలెండర్ పై దక్షిణాదికి చెందిన ఒక్క విజయ్ దేవరకొండకు మాత్రమే స్థానం దక్కింది. ఈఫోటో షూట్ కు సంబంధించిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. షేర్ చేసిన ఈఫోటో కొన్ని నిముషాలలోనే వైరల్ గా మారింది. దీనితో ఎలర్ట్ అయిన అనేకమంది టాలీవుడ్ యంగ్ హీరోలు తమ సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆశ్చర్యంగా మారింది.

ఈవ్యవహారాన్ని గమనించిన కొందరు విజయ్ దేవరకొండను చూసి చాలామంది హీరోలు ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో అనేకమంది యంగ్ హీరోలు ఇప్పటికే విజయ్ పై అసూయ పెంచుకున్నారు అన్నకామెంట్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘లైగర్’ మూవీకి జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ సారధ్యంలో స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయబడటం ఒక సంచలనంగా మారింది.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి యాక్షన్ సీన్స్ కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో విజయ్ శిక్షణ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇదిచాలదు అన్నట్లుగా ఈచిత్రంలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడు అని వార్తలు రావడం మరింత సంచలనంగా మారింది. వాస్తవానికి టైసన్ తో కొన్ని సీన్స్ షూట్ చేయడానికి ‘లైగర్’ మూవీ యూనిట్ అమెరికాకు వెళ్ళవలసి ఉంది. అయితే ఇప్పుడు మారిన కరోనా పరిస్థితులు వల్ల టైసన్ ను ముంబాయి పిలిపించి అక్కడ అతడితో విజయ్ చేయవలసిన సీన్స్ చిత్రీకరిస్తారని టాక్..    



మరింత సమాచారం తెలుసుకోండి: