టాలీవుడ్ దర్శకుడు తేజ గురించి ఆయన తెరకెక్కించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమకథలను సరికొత్త కోణంలో ఆవిష్కరించే దర్శకుడు తేజ ఎన్నో సినిమాలను టాలీవుడ్ లో తెరకెక్కించి చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమా తెలుగు ప్రేక్షకులకు అందరినీ ఎంతగానో మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అనిత నటించగా తెలంగాణ శకుంతల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

హీరోయిన్ గొర్రెలు కాసుకునే వాడి కూతురు కాగా అబ్బాయి రిచ్ మ్యాన్ కొడుకు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. ప్రేమ కోసం వారు ఏం చేశారు అనేదే ఈ సినిమా కథ. కథ విని ఉదయ్ కిరణ్ ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పగా సినిమా ముహూర్తం కోసం సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా తొలి రోజు తనికెళ్ల భరణి తెలంగాణ శకుంతలతో షూటింగ్ మొదలు కాగా ఈ సినిమాకి హీరోగా సుమంత్ ని అడిగితే నో చెప్పారు. ఆ తర్వాత మాధవన్ తెలుగు మూవీస్ చేయనున్నారు. దాంతో ఉదయ్ కిరణ్ ఓకే
చేయడంతో తేజ సలహాలు సూచనలు తీసుకునే వారట. 

ఈ సినిమాలో హీరోయిన్ కోసం ముంబై నుంచి ఆడిషన్స్ కి రాగా అందులో ఓ అమ్మాయి చాలా బాగుంది కానీ ఆమె పోజులు కొట్టడంతో తనకు హీరోయిన్ దొరికింది అని చెప్పి పంపించారట ఆమెనే హీరోయిన్ అనిత. ఈ సినిమాలో నెగటివ్ రోల్ కు తెలంగాణ శకుంతల మీద డౌట్ వచ్చి బెంగళూరు పద్మ అని పిలిచి ఓ రోజు షూట్ చేశారు కాగా తనికెళ్ళ విషయం చెప్పడంతో శకుంతల ఎంటరయ్యారు. అంతేకాదు వైజాగ్ ప్రసాద్ హీరో తండ్రి పాత్ర చేశారు.  గాజువాక పిల్ల తో పాటు వెంకీ మూవీ కోసం రికార్డు చేసిన మరో పాట తుమ్మెదా అనే పల్లవి తీసేసి ప్రియతమా అని మార్చేసి మొత్తం 11 చేశారు. ఆర్పీ పట్నాయక్, ధర్మవరపు సుబ్రమణ్యం,తేజ, ఉదయ్ కిరణ్ ఇలా అందరికీ ఒకేసారి బ్రేక్ ఇచ్చిన సినిమా 21 కోట్ల వరకు కలెక్ట్ చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: