ప్రస్తుతం
రాజమౌళి దర్శకత్వంలో
ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమురం
భీమ్ పాత్రలో ప్రేక్షకులను తన నటనతో మరొకసారి అబ్బుర పరిచే విధంగా
ఎన్టీఆర్ నటించబోతున్నాడని తెలుస్తుంది. గతంలో
రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ వంటి చిత్రాలను చేసిన
ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాతో మరో
బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని చూస్తున్నాడు.
కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ ఆ మధ్య విడుదల కాగా ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది అని చెప్పవచ్చు.
అయితే
ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలతో పాటు గా మరొక సినిమాను కూడా తెరకెక్కించే విధంగా ప్రణాళికలు వేసుకున్నాడు.
తమిళ దర్శకుడు
వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ
సినిమా చేయడానికి
ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది.
తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో
బ్లాక్ బస్టర్ చిత్రాలు చేసిన
వెట్రిమారన్ ఇటీవలే
ఎన్టీఆర్ కు ఓ
మాస్ మసాలా కథను వినిపించగా దానిని ఓకే చేసే విధంగా
ఎన్టీఆర్ ఉన్నాడట. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. దీంతో
ఎన్టీఆర్ మూడు చిత్రాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడన్నమాట.