'ఇండియన్2' సెట్స్కి వెళ్లినప్పటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సెట్స్లో క్రేన్ వర్కర్స్ కిందపడి చనిపోయినప్పుడు కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత బడ్జెట్ విషయంలో గొడవలు జరిగి 'ఇండియన్2'కి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ లోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చి షూటింగ్ మొత్తానికే ఆగిపోయింది.
'ఇండియన్2' ఆగిపోయాక శంకర్ రెండు సినిమాలు ప్రకటించాడు. రామ్ చరణ్తో ఒక సినిమా, రణ్వీర్ సింగ్తో 'అన్నియన్' రీమేక్ ప్రకటించాడు. ఈ లోపు లైకా ప్రొడక్షన్స్ కోర్టుకి వెళ్లింది. బయటే తేల్చుకోవాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో 'ఇండియన్2' పక్కనపెట్టేసి రామ్ చరణ్ సినిమా కూడా లాంచ్ చేశాడు.
కమల్ హాసన్ ఇటీవలే 'ఇండియన్2' ఆగిపోలేదు, మళ్లీ స్టార్ట్ చేస్తాం అని చెప్పాడు. శంకర్తో డిస్కషన్స్ జరుగుతున్నాయి.. త్వరలోనే సెట్స్కి వెళ్తాం అని కూడా చెప్పాడు. కానీ శంకర్, చరణ్ సినిమాతో బిజీ అయ్యాడు. దీంతో మళ్లీ 'ఇండియన్2' ఆగిపోయిందనే టాక్ స్టార్ట్ అయింది. మరి ఈ మూవీపై శంకర్ ఎప్పటికి క్లారిటీ ఇస్తాడో చూడాలి. కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రం ఇండియన్ 2 సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.