ఇక ఇవాళ తాజాగా బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్లో సందడి చేసారు. టాప్లెస్ పోర్ట్ జీప్లో తన భార్య వసుంధరను పక్కన కూర్చొపెట్టుకుని స్వయంగా బాలకృష్ణ బీచ్ వద్ద జీపు నడపడం.. కుటుంబ సభ్యులతో బీచ్లో కొద్ది సేపు గడిపారు. అక్కడికి వచ్చిన వారందరూ బాలకృష్ణను చూసేందుకు గుమిగూడారు.
ఇక బాలయ్య చేసిన గుర్రపు స్వారీ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది. గుర్రంతో బాలయ్య వేయించిన డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. ముఖ్యంగా బాలయ్య ఓ పాట పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తుండగా.. ఆ గుర్రం లయబద్ధంగా స్టెప్పులేసింది. గుర్రంపై బాలకృష్ణ పుల్ జోష్తో కనిపించారు. ఓ వైపు బాలయ్య కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండగా.. మరొక వైపు అభిమానులు సైతం జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఇక ఆ తరువాత అదే గుర్రం మీదకు బాలయ్య కుమారుడు మోక్షాజ్ఞ ఎక్కి కొద్దిసేపు స్వారీ చేసారు. ఒకే ప్రేమ్లో తండ్రి, కొడుకులను చూసిన స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలకృష్ణ సతీమణితో పాటు.. ఆయన వారసుడు మోక్షాజ్ఞ కూడా కారంచేడులో మేనత్త ఇంటి వద్ద ఆనందంగా గడుపుతున్నారు. మొత్తానికి దగ్గుబాటి వారి ఇల్లు నందమూరి కుటుంబ సభ్యుల రాకతో సంక్రాంతి పండుగ వేళ భలే సందడి వాతావరణంగా మారింది.