ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కొన్ని క్రేజీ క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. స్టార్ హీరోలు కూడా కలిసి పని చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు.

అయితే సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని తమిళ తంబీలు ఎప్పటి నుండో కలలు కంటున్నారట. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరి మల్టీ స్టారర్ మూవీ గురించి మీడియాలో చర్చ జరుగుతోందని సమాచారం.. అదుగో ఇదుగో అంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి.


తాజాగా మరోసారి వీరిద్దరి కాంబో మల్టీ స్టారర్ మూవీ గురించి చర్చ మొదలు అయ్యిందని తెలుస్తుంది.కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.తమిళంతో పాటు తెలుగు లో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశారట.. ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ సీక్వెల్ పనులు కూడా మొదలు పెట్టారు.

తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఖైదీ సీక్వెల్ లో సూర్య కూడా నటించబోతున్నాడని సమాచారం.. కథానుసారం ఒక పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.. ఆ పాత్రను సూర్య తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడు.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై ఉన్న నమ్మకం మరియు ఆయన స్టార్ డమ్ నేపథ్యంలో సూర్య సీక్వెల్ లో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడట..


తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి స్టార్ డమ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించడం వల్ల ఖచ్చితంగా సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయమని తెలుస్తుంది.. అక్కడ ఇక్కడ సినిమా స్థాయి భారీగా పెరుగుతుంది. కనుక సూర్య నటించడం అనేది మంచి నిర్ణయం అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయమట. లోకేష్ కనగరాజ్ వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు.

కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా తో ఖచ్చితంగా మంచి విజయాన్ని అందిస్తాడని అభిమానులు కూడా నమ్ముతున్నారు. విక్రమ్ సినిమా కనుక సూపర్ హిట్ అయితే అప్పుడు ఖైదీ సీక్వెల్ కు విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వడం అలాగే దానికి తోడు సూర్య కూడా నటించడం తో అంచనాలు మరింతగా పెరగడం ఖాయమని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: