బుల్లితెర పై ఒకప్పుడు బాగా ఫెమస్ అయిన షో జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడీన్లు ఇప్పుడు సినిమాల లో స్థిర పడ్డారు..అందులో సుధీర్ కూడా ఒకడు.. ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో చేసి ఈ మధ్య బయటకు వెళ్ళిన సంగతి తెలిసిందే..బుల్లితెరపై సుడిగాలి సుధీర్ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు.ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన కెరీర్ సూపర్ స్టార్ రేంజ్ వరకు వెళ్లింది. ఇప్పుడు బుల్లితెరకు మెగాస్టార్ లెవెల్‌లో క్రేజ్ వచ్చేసింది. షోలో ఏం ఉన్నా లేకపోయినా సరే సుడిగాలి సుధీర్ ఉంటే చాలు అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు.

 సుధీర్ కనిపిస్తే చాలు అని అభిమానులు అంటుంటారు. అయితే ఈ మాట కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సగటు బుల్లితెర ప్రేక్షకుడూ అంటున్నాడు.సుడిగాలి సుధీర్ అనే టీంను టాప్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఈ ప్రయాణంలో సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్‌లు మరింత దగ్గరయ్యారు. వారి స్నేహంతో పాటే వారి క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది.వేణు ఇచ్చిన డైలాగ్స్‌ను సుధీర్ క్షణాల్లో చెప్పేయడంతో వెంటనే నచ్చేశాడట. అలా జబర్దస్త్ ప్రయాణం వేణు ద్వారా మొదలైంది.అయితే కొద్ది కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. అక్కడే సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ త్రయం కూడా ఏర్పడింది.


సుధీర్‌కు ఈ రేంజ్ క్రేజ్ రావడానికి రష్మీ కూడా ఓ కారణం అవుతుంది. రష్మీ సుధీర్ జోడిని బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ప్రేమిస్తుంటారు.ఇకపోతే ఇప్పుడు స్టార్ మా లో అతని రెమ్యునరేషన్ 15 లక్షలు అనే టాక్ వినిపిస్తోంది.ఒక వేళ సుధీర్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడంటే.. బుల్లితెరపై తిరుగులేని మెగాస్టార్ అన్నట్టే. అయితే సుధీర్ బుల్లితెరపై తన సత్తాను చాటుతున్నాడు. కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోతోన్నాడు. హీరోగా నిలబడేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు..అవి సక్సెస్ అయితే మాత్రం అతని దశ తిరిగిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: