సుడిగాలి సుదీర్.. ఈ పేరు చెబితే చాలు బుల్లితెరపై పూనకాలు వచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు అని చెప్పాలి. రామోజీ ఫిలిం సిటీలో మేజీషియాన్ గా మొదలైన సుధీర్ ప్రయాణం ఇక ఇప్పుడు వెండితెరపై హీరో వరకు సాగింది. ఇక ఇప్పుడు బుల్లితెరపై మంచి కమెడియన్ గా యాంకర్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందుకొని ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలలో సుధీర్ ని చూశారు ప్రేక్షకులు. కానీ అతనిలో కోపం అనే గుణం ఉందా అని ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతూ ఉంటుంది.


 ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది సుధీర్ ని చూస్తే ఎంతగానో అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సుదీర్ బుల్లితెర మన్మధుడు అని అంటూ ఉంటారు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ అనే కార్యక్రమంలో కామెడీ పంచిన సుడిగాలి సుదీర్ శ్రీదేవి గ్రామ కంపెనీ లో యాంకర్ గా అవతారమెత్తి అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత ఈ టీవీ నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మల్టీ టాలెంటెడ్ పవర్ హౌస్ అయిన సుధీర్ ను స్టార్ మా  అయినా సరిగ్గా వాడుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


 ఇప్పటికే వేణు, ధన్ రాజ్ లాంటి సీనియర్లు ఉన్న అనసూయ లాంటి యాంకర్ ఉన్న సుధీర్ కి పెద్ద పీట వేశారు. ఒక షోని విజయవంతం కూడా చేయించారు. ఇక ఇప్పుడు సుధీర్ ని ఈటీవీ లో లాగానే ప్లేబాయ్  లా చూపించేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. తద్వారా అటు సుదీర్ ఇమేజ్కి డామేజ్ తప్ప పెద్దగా ఒరిగేదేమీ లేదు అనేది తెలుస్తుంది. మల్టీ టాలెంటెడ్ సుధీర్ ను సరిగ్గా వాడుకుంటే బాగుంటుందని ఎంతో మంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాడుకున్నోళ్లకి వాడుకున్నంతగా ఇక సుధీర్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. మరి స్టార్ మా సుధీర్ టాలెంట్ ని ఎలా వాడుకుంటుందో అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: