టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ఒక వెలుగు వెలుగుతోంది రీసెంట్గా ఈమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోని నటిస్తోంది. అలా గత ఏడాది వచ్చిన యశోద సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన శాకుంతలం సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవల్ లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది.


అయితే ఈ సినిమాను గతంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించిన పలు కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పటికే విడుదల తేదీని లాక్ చేసిన చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలలో ఒక వార్త వైరల్ గా మారుతోంది. శాకుంతలం సినిమా ఇంకా విడుదల కాకముందే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటి దిగ్గజ సంస్ధ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తూ ఉన్నారు. భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమానీ డైరెక్టర్ గుణశేఖర్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ట్రైలర్లు చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా బాహుబలి ని తలపించే విధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో సమంత కం బ్యాక్ ఇవ్వడం ఖాయం అంటూ కూడా పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: