గత ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తాయి అనుకుంటే బడా హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ చిన్న సినిమాల హవా మాత్రం భారీ స్థాయిలో కొనసాగింది. ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు టార్గెట్ ని రీచ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.. 2023లో చిన్న సినిమా లదే హవా అని కూడా చెప్పవచ్చు. అయితే తెలుగు సినీ ఫీలింగ్ ఇండస్ట్రీలో 2023లో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల విషయాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుపొందిన చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర సినిమా 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. హీరో అఖిల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఏజెంట్.. ఈ సినిమా 30 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. హీరో నితిన్ , శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా 19 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందట.


నాగచైతన్య కృతి శెట్టి కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం కస్టడీ 17 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా 16 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.. సమంత డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ డ్రామా చిత్రం శాకుంతలం ఈ సినిమా 14 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.. గత ఏడాది ఎక్కువగా నష్టాలను మిగిల్చిన చిత్రాలు ఇవి మరి ఏడాదైన అభిమానులను మెప్పించే విధంగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తారేమో చూడాలి మరి.. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: