హాట్ బ్యూటీ అదా శర్మ నటించిన ' ది కేరళ స్టోరీ' సినిమా పెద్ద హిట్ అయ్యి వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. మే 5, 2023న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు OTT లోకి అడుగుపెట్టింది.థియేటర్‌లో సంచలనం రేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది.అలాగే రికార్డు స్థాయి వ్యూస్ రాబడుతోంది. ఫేమస్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5లో ఈ కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.ఈ మూవీలో ఓ వివాదాస్పద కథాంశం ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. అదా శర్మ హిందూ మతం నుండి ముస్లింగా మారిన తర్వాత చాలా కష్టాలను అనుభవించే అమ్మాయి పాత్రలో నటించింది. కేరళలో జరిగిన మతమార్పిడి ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా ఎన్నో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అయితే ది కేరళ స్టోరీ పై నిషేధం విధించారు. ఇక అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు.


బీజేపీ నాయకులు ఈ మూవీకి మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం మండిపడ్డాయి. ఇప్పుడు మళ్లీ OTTలో విడుదలైన తర్వాత, 'ది కేరళ స్టోరీ' సినిమా గురించి చర్చ మళ్లీ బలంగా వినిపిస్తోంది. 'ది కేరళ స్టోరీ' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 242 కోట్ల రూపాయలను రాబట్టింది. ఫారిన్ కలెక్షన్స్ కలుపుకుంటే దాదాపు రూ.303 కోట్లు రాబట్టింది. అదే విధంగా 'ది కేరళ స్టోరీ' సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నారు. ఇది ఫస్ట్ వీకెండ్ లోనే 150 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను క్రాస్‌ చేసింది. ఇదో సూపర్ రికార్డ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసింది జీ5 సంస్థ.9 నెలల క్రితమే 'ది కేరళ స్టోరీ' సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికీ ఓటీటీకి రావడం మాత్రం చాలా ఆలస్యమైంది. వివాదం కారణంగా చాలా OTT ప్లాట్‌ఫారమ్‌లు ఈ మూవీని ప్రసారం చేయడానికి ఇష్టపడలేదు. చివరగా, ఈ మూవీని 'జీ5' ద్వారా OTTలో ప్రసారం చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నటి అదా శర్మకు కూడా డిమాండ్ పెరిగింది.ఆమెకు ఇప్పుడు చాలా ఆఫర్లు వస్తున్నాయి. చాలా ప్రాజెక్ట్స్‌తో ఆదా శర్మ బిజీబిజీగా ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: