కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నటులలో విశాల్ ఒకరు. ఈయన ఆఖరుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే సినిమాలో హీరో గా నటించాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుంది . ఈ మూవీ తో విశాల్ క్రేజ్ కూడా బాగా పెరిగి పోయింది . ఇక పోతే ప్రస్తుతం విశాల్ , హరి దర్శకత్వంలో రూపొందుతున్న రత్నం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాని ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను కూడా విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా లోని రెండవ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని సెకండ్ సింగిల్ ని మార్చి 29 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆదిత్య మ్యూజిక్ తమిళ్ ఛానల్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా లోని సెకండ్ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: