సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేడు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీసులో జరిగే విచారణకు మహేష్ బాబు హాజరు కావాలని వెల్లడించారు. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేష్ బాబుకు రూ. 5.9 కోట్ల చెల్లించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అందులో రూ. 3.4 కోట్లు చెక్కు రూపంలో మిగతా రూ. 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇక నేడు ఈడీ అధికారుల విచారణకు హీరో మహేష్ బాబు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. 

ఇకపోతే మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేష్ బాబు మంచితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. ప్రిన్స్ అందం గురించి ఎంత పొగిడిన తక్కువే. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటారో.. ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది.

 
ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్  కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నుంచి ఒక్క పిక్ కూడా లీక్ అవ్వకోడదని ప్రిన్స్ మహేష్ బాబుతో, జక్కన్న ముందే నో మోర్ లీక్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇటీవల హోలీ పండుగకి  కూడా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జకన్నతో కలిసి ఒడిశాలో షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: