టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మధ్య ఏదో సంథింగ్ ఉన్నట్లుగా గత కొన్నేళ్లుగా  వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించడంతో కచ్చితంగా ఈ విషయం ప్రతిసారి వినిపిస్తూనే ఉంది. కానీ వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు ప్రేమ విషయంపై అధికారికంగా ప్రకటించలేదు. అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్ లో,వెకేషన్లలో ఒకరినొకరు కలవడం జరుగుతూ ఉంటుంది. కానీ తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక తమ ప్రేమ విషయాన్ని ఒక్కొక్కరు నెమ్మదిగా రివిల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.


ఇప్పటివరకు ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణం చేయడం, అలాగే ఒకే లొకేషన్ లో ఉన్న ఫోటోలను షేర్ చేయడం వంటివి జరుగుతూ ఉండేది. కానీ తాజాగా నిన్నటి రోజున రష్మిక నటిస్తున్న మైసా అనే చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రష్మిక ఈ పోస్టర్లో చాలా సర్ప్రైజ్ గా అభిమానులకు ఆశ్చర్యపరిచేలా కనిపించింది. చాలామంది రష్మిక పోస్టర్ ను చూసి విభిన్నంగా స్పందించారు. మైసా పోస్టర్ కి విజయ్ దేవరకొండ కూడా స్పందిస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఆ పోస్టర్ని షేర్ చేసి ఇది అద్భుతంగా ఉండబోతోంది అంటూ కామెంట్స్ చేశారు.


విజయ్ దేవరకొండ కామెంట్స్ కి రష్మిక ఇలా స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా ప్రత్యేకించి మరి శుభాకాంక్షలు అంటూ స్పందించింది.. కానీ విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ కి విజ్జు.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా నేను చేస్తానంటూ ఒక పోస్ట్ ని సైతం షేర్ చేసింది. ఈ కామెంట్స్ తో  రష్మిక,విజయ్ దేవరకొండ మధ్య ఉన్న ప్రేమ బంధం మరొకసారి  రివీల్ చేసినట్లుగా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతటి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా ఒక హీరోని విజ్జు అని పిలవడం జరగదు.. ఇద్దరి మధ్య స్నేహానికి మించి  చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే తమ మధ్య బంధాన్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: